Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహాత్మా గాంధీ ని ఫాలో అవుతున్న నయనతార
నయనతార తాజాగా మహాత్ముడు చూపిన బాటలో నడుస్తోందని తమిళ పరిశ్రమలో వినపడుతోంది. ఇంతకీ గాంధీజీ సిద్దాంతాలలో ఏది ఆమె పాటిస్తోంది అంటే...ఏదైనా మొదట తాను ఆచరించే ఇతరులకు చెప్పాలనే సందేశం. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.."ఓ మంచి మాట, ఓ మంచి పని చేసేందుకు ఉపన్యాసాలూ, సందేశాలు అవసరం లేదు. ముందు మనం ఆచరించి చూపిస్తే మంచిదనుకొంటాను. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా నాకు నచ్చిన పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాను. అది చేయండి..ఇలా చేయండి అంటూ మనం పాటించకపోతే బాగోదు. ముందే నేను పాటించి తరవాత చెబుతాను" అంటోంది. పర్యావరణ పరిరక్షణ కోసం నయనతార ఈ మధ్య ప్రచారం మొదలుపెట్టింది. ఆమె షాపింగ్కి వెళ్తే కాగితపు సంచుల్నే చేతులో ఉంచుకొంటుందని చెన్నై జనాలు చెబుతున్నారు. ఎవరన్నా అడిగితే 'అంతా పర్యావరణ పరిరక్షణ కోసమే' అని చెప్తోంది. ఇక నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన సింహాలో చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.