Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనతార చిత్రాలు బ్యాన్?
నయనతార,ప్రభుదేవా వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ప్రభుదేవా భార్య రామలత ఇప్పటికే నయనతారని కలసి తన కాపురంలో నిప్పులు పోయిద్దని వేడుకుంది..అనంతరం గొడవ చేసింది. అయితే ప్రభుదేవా,నయనతార ఇద్దరూ ఈ విషయాలు లెక్కచేయకపోవటంతో ఆమె ఈ విషయాన్ని మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో వారు కూడా నయనతారకి తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. అయితే అది కూడా లెక్కచేయకపోవటంతో వారు ఆమె సినిమాలను తమిళనాడులో రిలీజ్ కాకుండా చేయాలని నిర్ణంయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే మొన్నీ మధ్యే నిర్మాతల మండలి నుండి బ్యాన్ ఎదుర్కొన్న ఆమె కిది పెద్ద తలనొప్పే అంటున్నారు. అయితే ఇవన్నీ ఇలా జరుగుతూంటే్ నయనతార మాత్రం తానూ ప్రభుదేవా భార్య మంచి స్నేహితురాళ్లమని కావాలనే ఈ రూమర్స్ పుట్టించి తమ మధ్య గొడవలు పెట్టడానికే ట్రై చేస్తున్నారంటూ చిలకపలుకులు పలుకుతోంది. ఇక విజయ్ హీరోగా చేసిన విల్లు చిత్రం నుండీ ప్రభుదేవా, నయనతారల మధ్య ఈ రిలేషన్ నెలకొంది. ప్రస్తుతం నయనతార నటించిన మల్లికా ఐ లవ్ యు చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ సరసన ఆమె అదుర్స్ చిత్రంలో చేస్తోంది. మొన్నీ మధ్యన రవితేజ సరసన చేసిన ఆంజనేయులు భాక్సాఫీసు వద్ద నెగిటివ్ రిజల్ట్ తెచ్చిపెట్టింది.