twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార పై స్టార్ డైరక్టర్ కేసు

    By Staff
    |

    Nayantara
    నిన్నటి దాకా స్టార్ గా ఒక వెలుగు వెలిగిన నయనతార టైం అయిపోయినట్లుంది. తాజాగా ఆమెను తన సినిమాలోంచి తొలిగిస్తున్నట్లు రన్,పందెంకోడి వంటి చిత్రాల స్టార్ డైరక్టర్ లింగు స్వామి ప్రకటించి,ఎడ్వాన్స్ ఎమౌంట్ వెనక్కి ఇవ్వమని కేసు వేసారు. అసలు ఇదంతా నయనతార వరస ఫ్లాఫ్ లతో వచ్చిన చిక్కు. కధానాయుకుడు ముందు ఆమె క్రేజ్ చూసి తన సొంత బ్యానర్ లో చేయబోయే పయ్యా చిత్రానికి కోటి రూపాయలు మొత్తానికి ఒప్పుకుని అడ్వాన్స్ ఇచ్చాడు లింగు స్వామి. అయితే ఆ తర్వాత ఆమె సినిమాలు వరసగా ఫ్లాఫ్ అవటం,ముఖ్యంగా ఎంతో హైప్ తో వచ్చిన ఆగిన్ అట్టర్ ఫ్లాఫ్ కావటంతో మార్కెట్లో ఆమెకు డిమాండ్ తగ్గింది.

    దాంతో లింగు స్వామి గౌరవంగా ఆమెను పిలిచి అంత ఎమౌంట్ ఇచ్చుకోలేనని,లాభాలు వస్తే తర్వాత చూసుకుందామని రెమ్యునేషన్ తగ్గించుకోమని అడిగాడు. దానికామె అది తన ప్రజ్టేజి ఇష్యూగా ఫీలవుతున్నానని తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాంతో లింగు స్వామి అడ్వాన్స్ అయినా తిరిగి ఇవ్వమని అడగటం జరిగింది. అయితే దానికి నయనతార తెలివిగా నేను ఆ సినిమా కోసం సెప్టెంబర్ లో డేట్స్ ఇచ్చాను. లింగు స్వామి పర్శనల్ కారణాలతో వాటిని వృధా చేసుకున్నాడు. అప్పటికీ నేను చాలా ఓపికగా ఎవరికీ డేట్స్ ఇవ్వకుండా ఆగాను. దాంతో నా కెరీర్ ఆగింది. మరో ప్రక్క అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమంటున్నారు.ఇది అన్యాయం అంటోంది. అలాగే ఈ డైరక్టర్ బయిట రకరకాల రూమర్స్ నాపై ప్రచారం చేస్తున్నాడని వినవచ్చింది. అంతేగాక నన్ను గాక వేరే హీరోయిన్స్ ని ఎప్రోచ్ అవుతున్నాడని రూఢీగా తెలిసింది. ఈ స్ధితిలో అతను అడ్వాన్స్ ఒదులుకోవటమే ఉత్తమమని అంటోంది. అయితే లింగు స్వామి దానికి ఒప్పుకోక ఈ రోజు(శుక్రవారం) ఆమెపై నిర్మాతల మండలిలో కేసు వేసాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X