Don't Miss!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐటం సాంగ్ చేస్తున్న నయనతార!
చెన్నై: రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్'లో కనపించిన నయనతార త్వరలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించి మురిపించనుంది. తమిళ హీరో ధనుష్ నిర్మిస్తున్న చిత్రంలో ఆమె ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ వార్త. శివకార్తికేయన్, ప్రియాఆనంద్ జంటగా ధనుష్ 'ఎదిర్ నీచ్చల్' పేరుతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ కానుంది.
తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో క్రేజ్ రావడానికి నయనతారను ఒప్పించే భాధ్యత తీసుకున్నాడు ధనుష్. ధనుష్ అడిగాడు కాబట్టే ఆమె కూడా ఓకే చేసిందంటున్నారు. అలాగే ఆ పాటలో తను కూడా కనిపిస్తాడు. నయనతార,తను డాన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నాడు. గతంలో ఆడవారి మాటలకు అర్దాలే వేరులే తమిళ వెర్షన్ లో వీరిద్దరూ కలిసి నటించగా ఘన విజయం సాధించింది. ఈ కాంబినేషన్ లో పాట అనగానే అక్కడ మీడియా కూడా సినిమాకు మంచి ప్రచారం కల్పించటం మొదలెట్టింది.
ఇక నయనతార మాత్రం కృష్ణం వందే జగద్గురం ప్రమేషన్ లో బిజీగా ఉంది. ఆ చిత్రం గురించి ఆమె చెపుతూ...రానా వంటి వ్యక్తిని ఇంతవరకు తాను చూడలేదని అందాల నయనతార కితాబిచ్చింది. "ఇవాళ చాలామంది స్టార్స్కు భిన్నంగా అందరికంటే సెట్స్ మీదకు వచ్చి, అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే నటుడు రానా. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. దెబ్బలు తగిలించుకున్నాడు. కథలోని దేవిక పాత్రను నేను చేయగలనని నమ్మిన క్రిష్కు థాంక్స్. ఓ మంచి పాత్ర చేశాననే తృప్తి కలిగింది. డబ్బింగ్ సమయంలో రచయిత సాయిమాధవ్ను ఇబ్బందిపెట్టా'' అని ఆమె చెప్పింది.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తెలుగులో మరికొందరు నిర్మాతలు ఇప్పుడు ఆమెను సంప్రదిస్తున్నారు. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు వివరాలు వస్తాయి.