Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రియుడిని దూరంగా పెట్టిన నయనతార.. కారణం ఇదేనంటూ వార్త వైరల్!
తమిళనాడులో కరోనావైరస్ పరిస్థితులు విజృంభిస్తున్న సమయంలో కూడా విఘ్నేష్ శివన్, నయనతార సన్నిహితంగా మెదిలారు. కోవిడ్ 19 మార్గ దర్శకాలను పాటిస్తూనే తమ లైఫ్ను ఇద్దరు సినీ ప్రముఖులు ఎంజాయ్ చేశారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ హైదరాబాద్లోనే ఉంటున్నప్పటికీ.. ఒకరికొకరు కలుసుకోవడం లేదట.. అందుకు కారణం ఇదేనంటూ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళితే..
రజనీకాంత్తో నయనతార
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం రజనీకాంత్తో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్ర షూటింగులో కుష్భూ, కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్, మీనా తదితరుల పాల్గొంటున్నారు.
సమంతతో విఘ్నేష్ శివన్ షూట్
ఇక విఘ్నేష్ శివన్ తన సొంత చిత్ర షూటింగులో బిజీగా మారిపోయారు. విజయ్ సేతుపతి, సమంత అక్కినేనితో కాథు వాకులా రెండు కధల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగు కూడా హైదరాబాద్లోనే జరుగుతున్నది.
అన్నాతే షూటింగులో ఆంక్షలు
అయితే అన్నాతే మూవీ యూనిట్ నటీనటులకు కఠినమైన కోవిడ్ నిబంధనలు విధించారట. బయట నుంచి ఎవరూ షూటింగ్లోకి రాకుండా.. అలాగే యూనిట్ సభ్యులు బయటకు వెళ్లకుండా ప్రత్యేకమైన ప్రదేశంలో అన్నాతే సినిమా షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నటీనటులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.
రజనీకాంత్ షూటింగులో జాగ్రత్తలు
రజనీకాంత్ లాంటి ప్రముఖ నటీనటులు సెట్స్ ఉన్నందున అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారనేది తాజా సమాచారం. యూనిట్లో ఏ ఒక్కరికి కోవిడ్ 19 సోకినా మొత్తం సిబ్బందికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు అనే విషయం తెలిసింది.
నయన్, విఘ్నేష్ మధ్య పెరిగిన దూరం
తమిళ చిత్రసీమలో ప్రేమ పక్షులగా పేరు తెచ్చుకొన్న నయనతార, విఘ్నేష్ శివన్ ఒకేచోటు ఉన్నప్పటికి వారిద్దరూ కలుసుకోవడం లేదట. కోవిడ్ కారణంగా రెండు షూటింగులకు సంబంధించిన నిర్వాహకులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుండటంతో వారిద్దరూ ఇబ్బంది పడుతన్నారట. ఈ పరిస్థితుల్లో నయన, విఘ్నేష్ విరహా వేదనకు గురి అవుతున్నారనేది తాజా సమాచారం.