Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
స్వర్ణదేవాలయంలో నయనతార.. గురుద్వారాలో ప్రియుడితో కలిసి...
కోలీవుడ్లో వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న అందాల తార నయనతార మరోసారి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొన్నారు. గతనెలలో నయనతార గోల్డెన్ టెంపుల్ను సందర్శించిన సంగతి తెలిసింది. నయనతార వెంట ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ ఉన్నారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకొన్న తర్వాత అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నెల రోజుల వ్యవధిలో నయనతార నటించిన రెండు చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. కొలమావు కోకిల (కోకో కోకిల), ఇమైక్క నాడిగల్ చిత్రాలు తమిళనాడులో కాసుల పంటను కురిపించాయి. ఈ సందర్భంగా స్వర్ణ దేవాలయానికి వెళ్లి మొక్కు తీర్చుకొన్నట్టు తెలిసింది.
స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకొన్న తర్వాత దాని బయట సెల్పీలకు ఫోజిచ్చారు. అనంతరం ప్రాంగణంలోని గురుద్వారాలో వారిద్దరు కలిసి నేల మీద కూర్చొని భోజనాలు చేశారు. గత కొద్దికాలంగా విఘ్నేష్, నయనతార సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని వీరిద్దరూ ఖండించకపోవడం గమనార్హం.