Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఆదిశక్తిగా నయనతార.. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఫోటోలు
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ముఖ్తి అమ్మన్ చిత్రం కార్యక్రమాలు లాక్డౌన్ కారణంగా ఆగిపోయాయి. తమిళనాడులో ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఈ చిత్రం పనులు జోరందుకొన్నాయి. ఈ సందర్భంగా ఆర్జే బాలాజీ, చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ట్వీట్లు వైరల్గా మారాయి.
వేల్స్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. ముఖ్తి అమ్మన్గా నయనతార త్వరలోనే మీ ముందుకు రాబోతున్నది అని వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ట్వీట్ చేసింది.
ముఖ్తి అమ్మన్ సినిమా గురించి దర్శకుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ సార్ నటించి.. ఎలాగైతే సందేశం ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు అజిత్ క్రేజ్ను తీసుకొచ్చినట్టే ముఖ్తి అమ్మన్ సినిమాకు నయనతార అలాంటి పాత్రను పోషించబోతున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి నయనతార చాలా ఉపయోగపడుతారు అని అన్నారు.
ఇక ఈ సినిమాపై వస్తున్న రూమర్లను ఆర్జే బాలాజీ కొట్టిపడేశారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం అని అన్నారు. తాజాగా షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్ ట్విట్టర్లో ట్రెండింగ్ మారాయి.