Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అజ్మీర్ దర్గాలో సందడి చేసిన నయనతార
నయనతార, వేలైకారన్ మూవీ టీమ్ రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు.
హీరోయిన్ నయతార ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న వేలైకారన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న సమీపంలోనే ప్రఖ్యాతిగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గా ఉండటంతో చిత్ర యూనిట్ అంతా వెళ్లి దర్గాను సందర్శించారు.
సినిమా ఇండస్ట్రీ వారికి ఈ దర్గా అంటే చాలా సెంటిమెంట్. బాలీవుడ్లో చాలా మంది స్టార్స్ తమ సినిమా విడుదల ముందు సెంటిమెంటుగా ఈ దర్గాను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే వేలైకారన్ సినిమా యూనిట్ కూడా దర్గాను సందర్శించారు.
నయనతారతో పాటు ఈ సినిమాకు స్టైలిస్ట్గా పని చేస్తున్న కోన నీరజ కూడా ఈ దర్గాను సందర్శించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దర్గాను విజిట్ చేయాలని ప్లాన్ చేసింది నయనతార అని, ఆమెకు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.
ఇంతకు ముందు ఈ దర్గాను ఏఆర్ రెహమాన్, మహేష్ బాబు, వివి వినాయక్ లాంటి తెలుగు స్టార్లు సందర్శించారు.