Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'నేటి చరిత్ర' దర్శకుడుకి ఆల్రెడీ దేహశుద్ధి చేసారు...
'మృగం' దర్శకుడు స్వామి తీసిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో 'నేటి చరిత్ర'గా డబ్బింగ్ చేసి రిలీజ్ కు రెడీ చేసారు. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం తమిళంలో విడుదలైన తర్వాత అక్కడ ఆ దర్శకుడుకి మహిళా సంఘాల వాళ్ళు దేహశుద్ది చేసారని, ఇక్కడా అటువంటిదే జరిగే అవకాశముందని చెప్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం స్వామి గతంలో తీసిన 'మృగం' చిత్రంలా ఇది కూడా మంచి హిట్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక ఈ 'నేటి చరిత్ర' చిత్రం తన సొంత కోడలను లొంగతీసుకునే ఓ మామ కథ. మిలట్రీ నుంచి ఊరికి వచ్చిన ఆ వ్యక్తి భార్య చనిపోతుంది. కొడుకు దగ్గర చేరతాడు. అప్పటికే కొద్ది రోజుల క్రిందట కొడుక్కి పెండ్లి జరుగుతుంది. తన భార్యతో సరదాగా గడిపే అతను చదువు నిమిత్తం వేరే ఊరు వెళ్ళాల్సి వుంటుంది. కానీ, భార్యను తన తండ్రి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కోడలిని లొంగదీసుకుంటాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక విషయం తెలిసిన కొడుకు తండ్రిని చంపేస్తాడు. ఆ తర్వాత భార్యనూ చంపేస్తాడు. ఇక ఈ చిత్రం మాతృక మలయాళం. మరి తెలుగు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని అంటున్నారు.