Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీకాంత్ ఓ జోకర్.. అంటూ వివాదం
సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ జోకరంటూ స్టంట్ మాస్టర్ జాగువార్ తంగం చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో సరికొత్త సమస్యను సృష్టించేలా కనిపిస్తున్నాయి. రజనీ తమిళనాడులో వున్నంత సేపు తమిళులకు మద్దతుగా మాట్లాడుతారని, కర్ణాటకకు వెళ్ళితే కన్నడిగులపై ప్రేమను ఒలకబోస్తారని విమర్శించారు.సమయాన్ని బట్టి ఇరు రాష్ట్రాల ప్రజల వద్ద క్షమాపణలు కోరతారని, రాజకీయాలతో సంబంధం లేదంటూనే హఠాత్తుగా అన్నాడీఎంకేకు మద్దతుగా ఓటు వేయాలని చెబుతుంటారని, అందువల్ల రజనీ అభిప్రాయాలను పట్టించుకోవలసిన అవసరం లేదని తగం మీడియా సమావేశం నిర్వహించి చెప్పుకొచ్చారు.
తంగం వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన రజనీ అభిమానులు ఎంజీఆర్ నగర్లోని జాగువర్ తంగం ఇంటిపై దాడి చేశారు. ఇందుకు ప్రతిగా తంగం మద్దతుదారులు కోడంబాక్కంలోని రజనీకాంత్ కళ్యాణమండపాన్ని ధ్వం సం చేశారు. జాగువర్ తంగం ఇంటి వద్ద పోలీసులు కాపలా వుండగానే ఈ దాడి జరిగింది. ఇందులో జాగువర్ తంగం సతీమణి శాంతి స్వల్పంగా గా యపడ్డారు. ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడడానికి కారణమవుతుందేమోనని సీనియర్ కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.