twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యా మీనన్ పై పిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు

    By Srikanya
    |

    ఆ మధ్య ప్రభాస్ పై కామెంట్స్ చేసి వార్తలు కెక్కిన నిత్యా మీనన్ ఇప్పుడు మరోసారి తనపై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేయించుకునే దాకా పరిస్ధితి తెచ్చుకుంది. హీరోయిన్ నిత్యామీనన్‌ తన బిహేవియర్ తో మొత్తం అన్ని చోట్లా సమస్యలు కొని తెచ్చుకుంటోంది. తాజాగా ...ఈమెపై మలయాళ నిర్మాతలకు కోపం వచ్చింది. షూటింగ్‌లో ఉన్న తనను కలవడానికి వచ్చిన కొంతమంది నిర్మాతలను పట్టించుకోలేదు. అంతేగాక వాళ్ళతో మళ్ళీ కలుస్తానని చెప్పి కలవలేదు. దాంతో వాళ్లకు కోపం వచ్చి మలయాళ నిర్మాతల మండలికి నిత్యాపై ఫిర్యాదు చేశారు. ఆమెను మలయాళచిత్రాల్లో అవకాశాలు ఇవ్వకుండా చూడాలని కోరారని తెలుస్తోంది. నిర్మాతలమనే మినిమం గౌరవం లేకుండా బిహేవ్ చేస్తోందని,చాలా అగౌవర పరిచిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమెను బ్యాన్ చేయాలని వారు పట్టుపడుతున్నారు.

    అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. తన కుమార్తెపై నిర్మాతలు చేసిన ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందనీ, నిత్యామీనన్ మలయాళ నిర్మాతల మండలితో చర్చిస్తోందని నిత్యామీనన్ తల్లి మీడియాకు తెలిపింది. ఇక అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఓవర్ నైట్ లోనే కుర్రకారు కలల హీరోయిన్ అయ్యిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సెగ,180 చిత్రాలు విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ సరసన ఇష్క్ అనే చిత్రం చేస్తోంది.అలాగే బాణం హీరో నారా రోహిత్ సరసన ఆమె బుక్కైంది. కథ చిత్రంతో పరిచయమైన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.

    English summary
    Nithya Menon who makes to headlines always with her behavior is banned by Malayalam producers. It is said that she didn’t respond to a producer properly when he approached her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X