Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిత్యా మీనన్ పై పిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు
ఆ మధ్య ప్రభాస్ పై కామెంట్స్ చేసి వార్తలు కెక్కిన నిత్యా మీనన్ ఇప్పుడు మరోసారి తనపై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేయించుకునే దాకా పరిస్ధితి తెచ్చుకుంది. హీరోయిన్ నిత్యామీనన్ తన బిహేవియర్ తో మొత్తం అన్ని చోట్లా సమస్యలు కొని తెచ్చుకుంటోంది. తాజాగా ...ఈమెపై మలయాళ నిర్మాతలకు కోపం వచ్చింది. షూటింగ్లో ఉన్న తనను కలవడానికి వచ్చిన కొంతమంది నిర్మాతలను పట్టించుకోలేదు. అంతేగాక వాళ్ళతో మళ్ళీ కలుస్తానని చెప్పి కలవలేదు. దాంతో వాళ్లకు కోపం వచ్చి మలయాళ నిర్మాతల మండలికి నిత్యాపై ఫిర్యాదు చేశారు. ఆమెను మలయాళచిత్రాల్లో అవకాశాలు ఇవ్వకుండా చూడాలని కోరారని తెలుస్తోంది. నిర్మాతలమనే మినిమం గౌరవం లేకుండా బిహేవ్ చేస్తోందని,చాలా అగౌవర పరిచిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమెను బ్యాన్ చేయాలని వారు పట్టుపడుతున్నారు.
అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. తన కుమార్తెపై నిర్మాతలు చేసిన ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందనీ, నిత్యామీనన్ మలయాళ నిర్మాతల మండలితో చర్చిస్తోందని నిత్యామీనన్ తల్లి మీడియాకు తెలిపింది. ఇక అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఓవర్ నైట్ లోనే కుర్రకారు కలల హీరోయిన్ అయ్యిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సెగ,180 చిత్రాలు విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ సరసన ఇష్క్ అనే చిత్రం చేస్తోంది.అలాగే బాణం హీరో నారా రోహిత్ సరసన ఆమె బుక్కైంది. కథ చిత్రంతో పరిచయమైన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.