Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్యాన్ పై స్పందించిన నిత్యా మీనన్
తనపై మళయాళ చిత్ర పరిశ్రమ పెట్టిన బ్యాన్ ముగిసిందని నిత్యా మీనన్ తెలిపింది. బుధవారంనాడు ఆమె మీడియా మాట్లాడింది. కేరళకు చెందిన మారుతీ చిట్ఫండ్ నూతన శాఖ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అదొక దురదృష్ట ఘటన అనీ, కొన్ని అపార్థాల వల్ల భేదాలు వచ్చాయంది. ఐతే తన చొరవతో అవన్నీ ఇప్పుడు తీరిపోయాయిని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ నిత్య ఎలాంటి చొరవ చూపి అపార్థాలను తొలగించుకున్నదో అని చర్చించుకుంటున్నారు. ఇక ఆమెపై బ్యాన్ పెట్టిన కారణాల్లోకి వెళితే...షూటింగ్లో ఉన్న తనను కలవడానికి వచ్చిన కొంతమంది నిర్మాతలను పట్టించుకోలేదు. అంతేగాక వాళ్ళతో మళ్ళీ కలుస్తానని చెప్పి కలవలేదు. దాంతో వాళ్లకు కోపం వచ్చి మలయాళ నిర్మాతల మండలికి నిత్యాపై ఫిర్యాదు చేశారు. ఆమెను మలయాళచిత్రాల్లో అవకాశాలు ఇవ్వకుండా చూడాలని కోరారని తెలుస్తోంది.
నిర్మాతలమనే మినిమం గౌరవం లేకుండా బిహేవ్ చేస్తోందని,చాలా అగౌవర పరిచిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమెను బ్యాన్ చేయాలని వారు పట్టుపడుతున్నారు. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. తన కుమార్తెపై నిర్మాతలు చేసిన ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందనీ, నిత్యామీనన్ మలయాళ నిర్మాతల మండలితో చర్చిస్తోందని నిత్యామీనన్ తల్లి మీడియాకు తెలిపింది. ఇక అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఓవర్ నైట్ లోనే కుర్రకారు కలల హీరోయిన్ అయ్యిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సెగ,180 చిత్రాలు విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ సరసన ఇష్క్ అనే చిత్రం చేస్తోంది.అలాగే బాణం హీరో నారా రోహిత్ సరసన ఆమె బుక్కైంది. కథ చిత్రంతో పరిచయమైన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.