twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీతగా నయనతార వద్దంటూ ఆందోళన..దిష్టి బొమ్మ దగ్ధం

    By Srikanya
    |

    బాపూ దర్సకత్వంలో రూపొందనున్న "శ్రీరామ రాజ్యం" చిత్రంలో సీత పాత్రకు ప్రముఖ నటి నయనతారను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన తమిళనాడులోని తిరుప్పూర్ లో ఆందోళన చేపట్టింది. రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆందోళనలో సేవ కార్యకర్తలు ఆమె దిష్టిబొమ్మను దగ్గధం చేశారు. రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో సోమవారం ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు చేస్తున్నారని, ఇదొక మల్టీస్టారర్‌ అని బాలకృష్ణ తెలిపారు. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహిస్తున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల, ఆర్ట్‌: రవీందర్‌, సినిమాటోగ్రఫీ: పి.ఆర్కే. రాజు, సంగీతం: ఇళయరాజా, దర్శకుడు: బాపు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X