Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
తెలుగు ప్లాప్ సినిమా... తమిళంలో మంచి హిట్
సిద్ధార్థ, శృతి హాసన్, హన్సిక, నవదీప్ లో రూపొందిన చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాన దిల్రాజు నిర్మించారు. అయితే ఈ చిత్రం విడుదలైన తొలిరోజు మార్నింగ్ షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అర్బన్ లవ్ స్టోరీగా,యుత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే రీసెంట్ గా ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని తమిళంలో తీసుకుని శ్రీధర్ పేరుతో విడదల చేసారు. చిత్రంగా అక్కడ హిట్టైంది.
ఆల్రెడీ తమిళంలో సిద్దార్ద, శృతి హాసన్, హన్సికలకు మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా హన్సిక ఇప్పుడు అక్కడ హాట్ స్టార్ కావటంతో ఈ చిత్రానికి మంచి ఓపినింగ్స్ వచ్చాయి. అలాగే ఈ చిత్రంలో అక్కడ రైట్స్ తీసుకున్న సతీష్ మార్పులు చేసారు. తమిళ ఆడియన్స్ కి కనెన్ట్ అయ్యేలా నేటివిటికి తగ్గట్లుగా రీషూట్ కూడా చేసారు. అలా స్క్రిప్టు పరంగా చేసిన మార్పలు ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. అంతేగాక గబ్బర్ సింగ్ విజయంతో హిట్ లో ఉన్న శృతి హాసన్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా మారింది.
సిద్దార్ద ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పటానికి ఆసక్తి చూపకపోవటంతో శివ కార్తికేయన్ చేత డబ్బింగ్ చెప్పించారు. అలాగే హన్సిక పాత్రకు గనూ సవిత చేత డబ్బింగ్ చెప్పించారు. అవన్నీ ప్లస్ లుగా మారాయని నిర్మాత సతీష్ చెప్తున్నారు. ఇదే ఊపులో మరెన్ని చిత్రాలను తమిళంలోకి డబ్ చేస్తానని అంటున్నాడు.
నేడు యువతలో ఉన్న కన్ఫ్యూజన్స్, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కలగలిపి వేణు ఈ చిత్రాన్ని రూపొందించారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.