Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
మెర్సల్కు మరో తలనొప్పి.. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ పిటిషన్
తమిళ సూపర్స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం రిలీజ్కు ముందు నుంచే అనేక వివాదాల్లో చిక్కుకున్నది. విడుదల తర్వాత కూడా మెర్సల్ను వివాదాలు చుట్టుముట్టడం ఆగడం లేదు.
తమిళ సూపర్స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం రిలీజ్కు ముందు నుంచే అనేక వివాదాల్లో చిక్కుకున్నది. విడుదల తర్వాత కూడా మెర్సల్ను వివాదాలు చుట్టుముట్టడం ఆగడం లేదు. తాజాగా మెర్సల్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవ్వడం మరోసారి వివాదం రాజుకొన్నది. అయితే ఈ నెల 27న రిలీజ్కు సిద్ధమవుతున్న మెర్సల్ డబ్బింగ్ చిత్రం అదిరింది రిలీజ్పై కూడా నీలిమేఘాలు అలుముకున్నాయి.
ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా..
జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మెర్సల్ చిత్రాన్ని తెరకెక్కించారు. భారత్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అవాస్తవాలను చిత్రంలో చూపించారు అని ఆరోపణలు చేస్తూ ఏ అశ్వనాథమన్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజలను తప్పుదారి పట్టించేలా..
మెర్సల్ చిత్రంలోని చాలా సన్నివేశాలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. ప్రధానంగా వస్తు, సేవల పన్ను విధానం గురించి తప్పుగా చూపించారు. చట్టాలను కించపరిచే విధంగా ఉన్న ఏ చిత్రం కూడా ప్రదర్శనకు అనర్హం అని అశ్వనాథన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు.
మెడికల్ మాఫియాపై ధ్వజం
ఇదిలా ఉండగా, మెడికల్, ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియాపై ధ్వజమెత్తుతూ రూపొందించిన మెర్సల్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ రూపొందించారు. ఈ చిత్రంలో డిజిటల్ ఇండియా, జీఎస్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో రాజకీయంగా ఈ చిత్రం వివాదమైంది. బీజేపీ నేతలు కొన్ని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
150 కోట్ల వసూళ్లు
విజయ్తోపాటు సమంత, నిత్యమీనన్, కాజల్ అగర్వాల్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలను లెక్క చేయకుండా కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
అదిరిందికి తప్పని చిక్కులు
అనేక వివాదాల మధ్య అదిరింది (మెర్సల్ తెలుగు) చిత్రం అక్టోబర్ 27న రిలీజ్కు సిద్ధమవుతున్నది. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అదిరిందిని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.