Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రజినీకాంత్పై కేసు నమోదు.. చిక్కుల్లో పడిన సూపర్ స్టార్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై కేసు నమోదు కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హేతువాది, నాస్తికుడు, ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన తీరును తప్పుపడుతూ కేసు నమోదైంది. వివరాల్లోకి పోతే..
తుగ్లక్ 50వ వార్షికోత్సవం.. రజినీ కామెంట్స్
జనవరి నెల 14న చెన్నైలో ఏర్పాటు చేసిన తమిళ మేగజైన్ తుగ్లక్ 50వ వార్షికోత్సవ వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెరియార్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 1971లో పెరియార్.. రాముడు,సీతల విగ్రహాలకు చెప్పుల దండవేసి ఊరేగించారని అన్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాలెంలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పెరియార్ అలా చేశారని చెప్పుకొచ్చారు.
రజినీకాంత్ క్షమాపణలు చెప్పాలి
రజినీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. పెరియార్ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజినీకాంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తరుణంలో
మణి ఫిర్యాదు మేరకు పోలీసులు రజినీకాంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రజనీ.. రాజకీయ ప్రవేశం కోసమే పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మణి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తరుణంలో రజినీకాంత్ ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
రజినీకాంత్ దర్బార్
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చారు. తన తాజా సినిమా 'దర్బార్'తో వసూళ్ల ప్రవాహం పారించారు. జనవరి 9న విడుదలైన ఈ సినిమా తమిళనాడు, ఓవర్సీస్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుమ్మేసింది. రజినీ స్టైల్కి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
సరికొత్త ఫీట్స్.. సంబరాల్లో అభిమానులు
తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దర్బార్ హవా నడుస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. నేటికీ ఈ సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది.