Don't Miss!
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ వీడియోపై పోలీసులు ఆగ్రహం.. సింగర్కు నోటీసులు.. డిలీట్ చేయమని ఆదేశం
తమిళ నాడు పోలీసుల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తన షాపును ఎక్కువ సేపు తెరిచి ఉంచాడనే కారణంతో జయరాజ్ అనే వ్యక్తిని, అతని కొడుకు ఫినిక్స్ను పోలీసులు అతి దారుణంగా చంపారు. చిత్రహింసలు పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు వారు చనిపోడంతో తమిళ సమాజమే కాకుండా యావత్ భారతదేశం ఈ ఘటనతో ఉలిక్కి పడింది.
సోషల్ మీడియాలో వైరల్..
చనిపోయిన తండ్రీ కొడుకులకు న్యాయం చేయాలని తమిళ ప్రజలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దేశం మొత్తం ఈ ఘటనపై స్పందించేలా ట్రెండ్ చేశారు. అందులో సింగర్ సుచిత్ర పాత్ర కూడా ఉంది. అందరూ తమిళంలోనే ట్వీట్ చేస్తుండగా.. అసలు సంగతి తెలియాలంటే ఆ ఘటన గురించి ఇంగ్లీష్లో అర్థమయ్యేలా వివరించాలని చెప్పుకొచ్చింది.
సుచిత్ర వీడియో హల్చల్..
దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితం అవుతున్నాయని, వారు ఇంగ్లీష్లో మాట్లడలేకపోవడమే అందుకు కారణమని సుచిత్ర చెప్పుకొచ్చింది. అందుకే ఈ ఘటన గురించిన వివరాలను, పోలీసుల అకృత్యాలను తాను వివరించి చెబుతానని, ఈ విషయం అందరికీ తెలిసేలా ఫార్వర్డ్ చేయండని కోరింది.
బట్టలు విప్పి..
వారిద్దరి మోకాళ్లను, మోచేతులను విరగ్గొట్టారని, ఆపై వారి మొహాన్ని గోడకు కొట్టి పచ్చడి చేశారని తెలిపింది. థర్డ్ డిగ్రీలో భాగంగా వారి జననాంగాలలో కట్టలు, బాటిళ్లను దూర్చారని, రక్తం విపరీతంగా ప్రవహించిందని, వారిని అలాగే నగ్నంగా ఉంచారని పోలీసులు అకృత్యాలను వివరించింది.
చక్కర్లు కొట్టిన వీడియో..
అలా సుచిత్ర షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో సుచిత్ర చెప్పినదానికి ఆధారాలు లేవని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులంటే ద్వేషం కలిగించేలా ఆమె వీడియోను షేర్ చేసిందని పోలీస్ విభాగం తెలిపింది.
డిలీట్ చేసిన సుచిత్ర..
అయితే తూత్తుకుడి పోలీసులు పంపిన నోటీసుల ప్రకారం సుచిత్ర ఆ వీడియోను డిలీట్ చేసింది. మొత్తానికి ఈ ఘటనపై దేశం మొత్తం స్పందించగా.. ఈ కేసు సీబీ సీఐడీ చేతిలోకి వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై కోలీవుడ్ మొత్తం నోరు విప్పడం విశేషం.