Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ వీడియోపై పోలీసులు ఆగ్రహం.. సింగర్కు నోటీసులు.. డిలీట్ చేయమని ఆదేశం
తమిళ నాడు పోలీసుల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తన షాపును ఎక్కువ సేపు తెరిచి ఉంచాడనే కారణంతో జయరాజ్ అనే వ్యక్తిని, అతని కొడుకు ఫినిక్స్ను పోలీసులు అతి దారుణంగా చంపారు. చిత్రహింసలు పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు వారు చనిపోడంతో తమిళ సమాజమే కాకుండా యావత్ భారతదేశం ఈ ఘటనతో ఉలిక్కి పడింది.
సోషల్ మీడియాలో వైరల్..
చనిపోయిన తండ్రీ కొడుకులకు న్యాయం చేయాలని తమిళ ప్రజలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దేశం మొత్తం ఈ ఘటనపై స్పందించేలా ట్రెండ్ చేశారు. అందులో సింగర్ సుచిత్ర పాత్ర కూడా ఉంది. అందరూ తమిళంలోనే ట్వీట్ చేస్తుండగా.. అసలు సంగతి తెలియాలంటే ఆ ఘటన గురించి ఇంగ్లీష్లో అర్థమయ్యేలా వివరించాలని చెప్పుకొచ్చింది.
సుచిత్ర వీడియో హల్చల్..
దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితం అవుతున్నాయని, వారు ఇంగ్లీష్లో మాట్లడలేకపోవడమే అందుకు కారణమని సుచిత్ర చెప్పుకొచ్చింది. అందుకే ఈ ఘటన గురించిన వివరాలను, పోలీసుల అకృత్యాలను తాను వివరించి చెబుతానని, ఈ విషయం అందరికీ తెలిసేలా ఫార్వర్డ్ చేయండని కోరింది.
బట్టలు విప్పి..
వారిద్దరి మోకాళ్లను, మోచేతులను విరగ్గొట్టారని, ఆపై వారి మొహాన్ని గోడకు కొట్టి పచ్చడి చేశారని తెలిపింది. థర్డ్ డిగ్రీలో భాగంగా వారి జననాంగాలలో కట్టలు, బాటిళ్లను దూర్చారని, రక్తం విపరీతంగా ప్రవహించిందని, వారిని అలాగే నగ్నంగా ఉంచారని పోలీసులు అకృత్యాలను వివరించింది.
చక్కర్లు కొట్టిన వీడియో..
అలా సుచిత్ర షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో సుచిత్ర చెప్పినదానికి ఆధారాలు లేవని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులంటే ద్వేషం కలిగించేలా ఆమె వీడియోను షేర్ చేసిందని పోలీస్ విభాగం తెలిపింది.
డిలీట్ చేసిన సుచిత్ర..
అయితే తూత్తుకుడి పోలీసులు పంపిన నోటీసుల ప్రకారం సుచిత్ర ఆ వీడియోను డిలీట్ చేసింది. మొత్తానికి ఈ ఘటనపై దేశం మొత్తం స్పందించగా.. ఈ కేసు సీబీ సీఐడీ చేతిలోకి వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై కోలీవుడ్ మొత్తం నోరు విప్పడం విశేషం.