Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జైలు ఆశ్రమంలా ఉందని పవర్స్టార్ వ్యాఖ్య
చెన్నై వచ్చిన పవర్స్టార్ మీడియాతో మాట్లాడుతూ.. 'కొందరి కుట్ర వల్ల మోసం కేసుల్లో చిక్కుకున్నా. దీనివల్ల సినిమాల్లో నటించలేకపోయాను. నేను గతంలో నటించిన 'ఆర్య సూర్య', 'సుమా నచ్చును ఇరుక్కు', యా యా' చిత్రాలు విడుదలకానున్నాయి. ఇవి నా అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. నేను జైల్లో ఉన్నన్ని రోజులు అధికారులు చాలా స్నేహపూర్వకంగా మెలిగారు. కొందరు నా అభిమానులుగా మారిపోయారు (మీరింకా మారలేదు గురూ!). జైలు నాకో ఆశ్రమంలా అనిపించింది. ఈ సమస్యలను నుంచి త్వరలోనే బయటపడతాను'అని చెప్పారు.
ఇక శ్రీనివాసన్పై రోజురోజుకు ఉచ్చు బిగిస్తోంది. పవర్స్టార్ వద్ద పనిచేసిన ఏజెంట్లను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నగదు అవసరమైన వారిని గుర్తించే బాధ్యతను పవర్స్టార్ తన ఫైనాన్స్ సంస్థలో ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వారికి అప్పగించినట్లు, వారంతా బాధితులకు మాయమాటలు చెప్పి పవర్స్టార్ ఉచ్చులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని కూడా అరెస్టు చేసేందుకు జాబితా రూపొందిస్తున్నారు.
వీరిలో ముఖ్యులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణు, చెన్నైకి చెందిన క్రిష్టోఫర్ అని గుర్తించారు. తాజాగా ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. నగదు మోసం కేసుల్లో అరెస్త్టెన పవర్స్టార్ ప్రస్తుతం వేలూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. తమను కూడా ఆయన మోసం చేశాడంటూ బాధితులు రోజూ నగర పోలీసు కమిషనర్ జార్జ్ను ఆశ్రయిస్తున్నారు. ఛండీగర్కు చెందిన జగదీష్సింగ్ ఇలా ఇచ్చిన ఫిర్యాదులో.. తనకు రూ.200 కోట్ల రుణం ఇప్పిస్తానని పవర్స్టార్ నమ్మించాడని ఆరోపించారు. ముందుగానే తన వద్ద రూ.రెండు కోట్లు కమీషన్ తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు.