మ్యాచ్ ఫిక్సింగ్ చేసే నయనతారను..
ప్రభుదేవ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నయనతారతో లైన్ క్లియర్ చేసుకున్నట్లు చెప్తున్నారు. తన మాజీ భార్య రమాలతతో విడాకుల విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కోర్టు బయిటే జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు లో కేసు నడుస్తున్నంతసేపు ఇద్దరూ చిరునవ్వు తో ఉండటంతో అందరికీ ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి.దానికి కారణం కోర్టు బయిట జరిగిన సెటిల్ మెంటే కారణమంటున్నారు. ఈ కేసు ఎంతకీ తెమలక పోవటంతో ప్రభుదేవా ఎలాగోలా తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో డబ్బు బాగా ఖర్చు పెట్టి సెటిల్మెంట్ చేసుకున్నాడంటున్నారు.
నిజానికి గత వారమే విడాకుల కేసు పూర్తి కావలసి ఉంది. కానీ తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి రమ రాలేదు.తాను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం జూలై పదో తేదీన విదేశాలకు వెళ్లవలసి ఉన్నందున ఈలోగా విడాకుల కేసును తేల్చవలసిందిగా ప్రభుదేవా ఓ ప్రక్క తొందరపడి సెటిల్మెంట్ చేసుకున్నాడంటున్నారు. ఇక డబ్బు పోతే పోయింది ఇక్కడితో కేసు తేలిపోయిందనే ఆనందంతో ప్రభుదేవా ఉంటే, పిల్లలకు రక్షణ,తనకు భధ్రతని ఇచ్చే మొత్తం లభించిందని రమాలత సంతోషంతో ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











