Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్వరలో ఒక ఇంటివారు కాబోతున్న ప్రభుదేవా, నయనతార....!
ప్రభుదేవా మరుయు నయనతార పెళ్శికి ఎట్టకేలకు రమాలత్ అంగీకరించినట్లు చెన్నై వర్గాల సమాచారం. ప్రభుదేవా మరియు రమాలత్ మధ్య జరిగిన చర్చలలో నయమతారతో ప్రేమ వ్వవహారానికి దారితీసిన పరిస్దితుల గురించి క్షుణ్ణంగా ప్రభుదేవా తన భార్యకు వివరించడంతో పాటు కొన్ని తాయిలాలను కూడా ముట్టబెబుతాననడంతో ఈ వ్వవహారం ఒక కోలిక్కి వచ్చింది. ఈ చర్చల్లో ప్రభుదేవా అన్నానగర్ లో తనకున్న ఖరీదైన బంగ్లా తో పాటు మూడుకోట్ల రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల నయనతార చాలా ఇష్టపడి మోజుపడి మరీ 75లక్షలు పెట్టి కోనుకున్న తన వజ్రాల నెక్లేస్ ను తనకి ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం. ప్రభుదేవా చెప్పిన ఈ విషయాలను జాగ్రత్తగా విన్న రమాలత్ ఏమనుకున్నారో ఏమోగాని నయనతారను తన భర్త మళ్శీ పెళ్సి చేసుకోవడానికి తన అంగీకరించినట్టు చెన్నైలో వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ రాజీ కుదర్చడంలో తమిళ పరిశ్రమకు చెందిన ఓ సినీ దంపతులు కూడా తమ వంతు సహాయం అందిచారని కోలీవుడ్ కోడై కూస్తుందని సమాచారం.