Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనతార క్రిష్టియన్ కావటంతో నో ఎంట్రి
నయనతార,ప్రభుదేవా కలిసి రీసెంట్ గా కేరళలోని శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయ్యూర్ వెళ్ళారు. అయితే ఆ గుళ్ళోకి కేవలం హిందువలనే ప్రవేశం అనే నియమం ఉంది. దాంతో క్రిష్టియన్ అయన నయనతార బయిట కార్లో కూర్చుని ఉంది.అలాగే లోపలకి ప్రభుదేవా వెళ్ళి దాదాపు ఇరవై ఐదు నిముషాల సేపు పూజలు చేసి వచ్చారు. ఇదంతా పదమూడవ తేది ఉదయం ఏడు గంటలకు జరిగింది. ప్రభుదేవా తెల్లటి లుంగి పైన కండువా వేసుకుని ఆచార ప్రకారం గుడిలోకి ప్రవేశించి మ్రెక్కు తీర్చుకున్నారు. అక్కడ ప్రధాన పూజారి గిరీశన్ నంబూద్రి ప్రత్యేక పూజ నిర్వహించి ప్రసాదం ఇచ్చారు. ప్రభుదేవా భగవంతుడుకి అరటిపళ్ళని నివేదన చేసారు. ఇద్దరూ ఈ గుడికి వస్తానని మొక్కుకోవటం వల్లే వచ్చారని చెప్తున్నారు. ఇక మీడియా కంటపడకుండా వెంటనే గుడిలోంచి పరుగుపరుగున వచ్చి కారులో ఎక్కి వెళ్ళిపోయారు ఆ జంట. ఇప్పుడా జంట కేరళలోని కొచ్చిలో తాము కొనుక్కున ఇంట్లో ఉన్నారు.