Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ వేడుకలో ప్రభుదేవా, తమన్నా స్టెప్పులు.. ఎప్పుడు? ఎక్కడంటే..
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, అందాల తార తమన్నా భాటియా సెప్పులు వేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరు కలిసి సినిమా కోసం స్టెప్పులు వేస్తున్నారనుకొంటే పప్పులో కాలేసినట్టే. ఏప్రిల్ 7న ముంబైలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రభుదేవా, తమన్నా కలిసి నృత్యం చేయనున్నారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల పాటలకు వారిద్దరూ కలిసి స్టెప్పులేస్తున్నఐపీఎల్ వర్గాలు వెల్లడించారు.
ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ కోసం ప్రముఖ కోరియోగ్రాఫర్ షైమాక్ దావర్ నృత్యాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. దేశ క్రీడారంగంలో ఐపీఎల్కు అత్యున్నత స్థానం ఉంది. దేశంలో బాలీవుడ్ సినిమాల తర్వాత అంత క్రేజ్ ఉన్నది క్రికెట్కు మాత్రమే. అలాంటి ఐపీఎల్ క్రీడా సంబురాల్లో తొలిసారి ఫెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. స్వింగ్ జరా, పింగా తదితర పాటలకు నృత్యం చేస్తున్నాను అని అన్నారు.
ఐపీఎల్ వేడుకల్లో ప్రభుదేవా, తమన్నాతోపాటు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, పరిణితి చోప్రా, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులు కూడా ఫెర్ఫార్మ్ చేయబోతున్నారు.