Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఆ వేడుకలో ప్రభుదేవా, తమన్నా స్టెప్పులు.. ఎప్పుడు? ఎక్కడంటే..
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, అందాల తార తమన్నా భాటియా సెప్పులు వేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరు కలిసి సినిమా కోసం స్టెప్పులు వేస్తున్నారనుకొంటే పప్పులో కాలేసినట్టే. ఏప్రిల్ 7న ముంబైలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రభుదేవా, తమన్నా కలిసి నృత్యం చేయనున్నారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల పాటలకు వారిద్దరూ కలిసి స్టెప్పులేస్తున్నఐపీఎల్ వర్గాలు వెల్లడించారు.
ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ కోసం ప్రముఖ కోరియోగ్రాఫర్ షైమాక్ దావర్ నృత్యాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. దేశ క్రీడారంగంలో ఐపీఎల్కు అత్యున్నత స్థానం ఉంది. దేశంలో బాలీవుడ్ సినిమాల తర్వాత అంత క్రేజ్ ఉన్నది క్రికెట్కు మాత్రమే. అలాంటి ఐపీఎల్ క్రీడా సంబురాల్లో తొలిసారి ఫెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. స్వింగ్ జరా, పింగా తదితర పాటలకు నృత్యం చేస్తున్నాను అని అన్నారు.
ఐపీఎల్ వేడుకల్లో ప్రభుదేవా, తమన్నాతోపాటు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, పరిణితి చోప్రా, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులు కూడా ఫెర్ఫార్మ్ చేయబోతున్నారు.