Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సిద్ధమవుతున్న 'జీన్స్' చిత్రం సీక్వెల్
దాదాపు పదిహేనేళ్ల తర్వాత సీక్వెల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ వర్గాల మాట. ఇటీవలే 'జీన్స్ 2' టైటిల్ను ఫిలిం ఛాంబర్లో నమోదు చేశారట త్యాగరాజన్. తన కుమారుడితో తాజాగా 'మలయూర్ మంబట్టియన్' తెరకెక్కించారాయన. ఇప్పుడీ కొత్త సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర నటీనటుల గురించి వివరాలు తెలియరాలేదు.
ఇక ఈ చిత్రం డైరక్టర్ శంకర్ సినిమాలంటే సౌత్ లో విపరీతమైన క్రేజ్. ప్రస్తుతం ఆయన విక్రమ్తో 'మనోహరుడు' చిత్రం రూపొందిస్తున్నారు . ఇది తుది దశకు చేరుకొంది. మరి శంకర్ తెరకెక్కించబోయే తదుపరి చిత్రం ఏమిటనే విషయమ్మీద చెన్నై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
అయితే శంకర్ ఇప్పటికే కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకొన్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో యువ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు కొద్ది వారాల్లో వెల్లడవుతాయి.
విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా భారీ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం తొలి షెడ్యూల్ చెన్నయ్ ప్రాంతంలో చిత్రీకరించారు. సినిమా గ్రాండ్గా రావడానికి బెస్ట్ లొకేషన్లు ఎంపిక చేసుకున్నాడు. గతంలో శంకర్ నిర్మించిన 'జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్లో చిత్రీకరణ జరుపి ప్రేక్షకులకు కనువిందు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.