Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని...ప్రియమణి
నా కెరీర్ ముగిసేలోగా మణిరత్నం గారి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా లక్ష్యం. ఓ రోజు అనుకోకుండా మణి సార్ దగ్గర నుంచి ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని వాలిపోయాను. 'రావణ్'లో వెన్నెల పాత్ర చేయమని కోరారు మణి గారు. వెంటనే ఒప్పేసుకున్నాను అంటూ చెప్తోంది ప్రియమణి. అలాగే ఈ చిత్రంలో ఐశ్వర్యరాయి హీరోయిన్. ఆమె చాలా అందగత్తె. ఆమెతో కలిసి నటించడం హ్యాపీ. కానీ, సినిమా విడుదలయ్యాక నా పాత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నారు...అని ఆనందంతో చెప్తోంది. ఇక..మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో ఓ చిన్న అతిథి పాత్ర చేయటానికైనా రెడీగా వున్న నాకు ఆయన ఓ మంచి పాత్రను ఇచ్చారు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి నా పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది. నేను అనుకున్నది జరిగింది. అంతేకాదు...ఈ చిత్రంతోనే నా బాలీవుడ్ ఎంట్రీ జరిగినందుకు గర్వంగా వుంది అంటోంది ప్రియమణి. విలన్ లో ఆమె విక్రమ్ చెల్లెలుగా శూర్పణఖలా కనిపించింది. ఆమె పాత్ర ఉన్నది కాస్సేపయినా మంచి రెస్పాన్స్ వచ్చిందనేది నిజం.