Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని...ప్రియమణి
నా కెరీర్ ముగిసేలోగా మణిరత్నం గారి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా లక్ష్యం. ఓ రోజు అనుకోకుండా మణి సార్ దగ్గర నుంచి ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని వాలిపోయాను. 'రావణ్'లో వెన్నెల పాత్ర చేయమని కోరారు మణి గారు. వెంటనే ఒప్పేసుకున్నాను అంటూ చెప్తోంది ప్రియమణి. అలాగే ఈ చిత్రంలో ఐశ్వర్యరాయి హీరోయిన్. ఆమె చాలా అందగత్తె. ఆమెతో కలిసి నటించడం హ్యాపీ. కానీ, సినిమా విడుదలయ్యాక నా పాత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నారు...అని ఆనందంతో చెప్తోంది. ఇక..మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో ఓ చిన్న అతిథి పాత్ర చేయటానికైనా రెడీగా వున్న నాకు ఆయన ఓ మంచి పాత్రను ఇచ్చారు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి నా పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది. నేను అనుకున్నది జరిగింది. అంతేకాదు...ఈ చిత్రంతోనే నా బాలీవుడ్ ఎంట్రీ జరిగినందుకు గర్వంగా వుంది అంటోంది ప్రియమణి. విలన్ లో ఆమె విక్రమ్ చెల్లెలుగా శూర్పణఖలా కనిపించింది. ఆమె పాత్ర ఉన్నది కాస్సేపయినా మంచి రెస్పాన్స్ వచ్చిందనేది నిజం.