Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని...ప్రియమణి
నా కెరీర్ ముగిసేలోగా మణిరత్నం గారి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా లక్ష్యం. ఓ రోజు అనుకోకుండా మణి సార్ దగ్గర నుంచి ఫోన్ రాగానే రెక్కలు కట్టుకొని వాలిపోయాను. 'రావణ్'లో వెన్నెల పాత్ర చేయమని కోరారు మణి గారు. వెంటనే ఒప్పేసుకున్నాను అంటూ చెప్తోంది ప్రియమణి. అలాగే ఈ చిత్రంలో ఐశ్వర్యరాయి హీరోయిన్. ఆమె చాలా అందగత్తె. ఆమెతో కలిసి నటించడం హ్యాపీ. కానీ, సినిమా విడుదలయ్యాక నా పాత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నారు...అని ఆనందంతో చెప్తోంది. ఇక..మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో ఓ చిన్న అతిథి పాత్ర చేయటానికైనా రెడీగా వున్న నాకు ఆయన ఓ మంచి పాత్రను ఇచ్చారు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి నా పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది. నేను అనుకున్నది జరిగింది. అంతేకాదు...ఈ చిత్రంతోనే నా బాలీవుడ్ ఎంట్రీ జరిగినందుకు గర్వంగా వుంది అంటోంది ప్రియమణి. విలన్ లో ఆమె విక్రమ్ చెల్లెలుగా శూర్పణఖలా కనిపించింది. ఆమె పాత్ర ఉన్నది కాస్సేపయినా మంచి రెస్పాన్స్ వచ్చిందనేది నిజం.