Don't Miss!
- News ఏపీలో మొత్తం మారిపోయిన సీన్..గెలుపు ఆ పార్టీదే తేల్చిసిన సర్వే
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Lifestyle చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే..విజయం వద్దన్నా వస్తుంది..
- Technology 100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
- Sports ఆర్సీబీలో ఆడే ఇండియన్ ప్లేయర్లకు ఇంగ్లీషే రాదు: సెహ్వాగ్ సెన్సేషన్
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ఖరీదైన జాగ్వార్ F టైప్ స్పోర్ట్స్ కారులో బామ్మ చక్కర్లు
ప్రభుదేవాతో నయనతార.. తమిళ నిర్మాత క్లారిటీ
ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ నిర్మాత ఇషారీ కే గణేష్ సినిమా ప్రారంభించనున్నారనే వార్త తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ చిత్రంలో నయనతార నటిస్తున్నారనే వార్త కోలీవుడ్ను కుదిపేసింది. అయితే ఆ వార్తపై నిర్మాత గణేష్ క్లారిటీ ఇచ్చారు.
బ్రేకప్ తర్వాత ప్రభుదేవా దర్శకత్వం వహించే సినిమాలో నటించడానికి నయనతార వార్త హాట్ టాపిక్ అయింది. అయితే ఆ వార్తలను నిర్మాత గణేష్ కొట్టిపడేశారు. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్తో ప్రారంభించిన చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనే మళ్లీ తెరకెక్కించే అవకాశమే లేదు అని అన్నారు.
ఇక గతంలో ప్రభుదేవా దర్శకత్వం నిర్మాత గణేష్ ప్రారంభించిన రాజా వెల్లై రాజా అనే చిత్రానికి కోసం సాయేషా సైగల్ను తీసుకొన్నారు. ఆ సమయంలో ఈ సినిమా సాధించే లాభాల నుంచి రూ.10 కోట్లు నడిగర్ తిలకం కార్యాలయానికి విరాళం ఇస్తాననే ప్రకటన చేయడం అప్పట్లో సంచలనం రేపింది.