twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పులి’ని చూసి మనుషులు భయపడతారు కానీ ‘రోబో’లు భయపడవు...

    By Sindhu
    |

    'పులి"ని చూసి మనుషులైతే భయపడతారు. కానీ రోబోలు భయపడవు కదా? అందుకే 'రోబో"ను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో 'ఎందీరన్" గా, తెలుగులో 'రోబో" గా శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం తెలుగు హక్కులు స్వంతం చేసుకోవడానికి 30కోట్లు చెల్లించడానికి ఇప్పటికే పలువురు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అయితే అంతకంటె ఎక్కువే ఆశిస్తున్న ఆ చిత్ర నిర్మాతలు ఆడియో విడుదలయ్యాక మాట్లాడదాం అంటున్నారంట.

    ఇటీవలే ఈ చిత్రం గుమ్మడికాయ కొట్టుకుంది. రజనీకాంత్,ఐశ్వర్య రాయ్ లపై పాటను చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. ఇక ప్రతి సన్నివేశంలోనూ శంకర్ తరహా గ్రాఫిక్స్ మాయాజాలం కనిపించే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు షూటింగ్ తో పాటు సమాంతరంగానే జరుగుతున్నాయి. కాబట్టి..ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల వ్యయంతో నిర్మించబడిందంటూ ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం ఏక కాలంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

    ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదలవ్వడమనేది ఖాయమైతే..'కొమరం పులి"కి కచ్చితంగా కష్టకాలమే. శంకర్ తో పాల్చితే..ధర్శకుడిగా ఎస్ జె సూర్య స్థాయి చాలా చిన్నది. అలాగే హీరోగా రజనీకాంత్ తో పోల్చితే..పవన్ కళ్యాణ్ స్థాయి కూడా ఇంచుమించుగా అంతే. ఈ రెండు చిత్రాలకు గల ఒకే ఒక్క సమాన పోలిక ఏమిటంటె రెండు చిత్రాలకు సంగీత దర్శకుడు ఎఆర్ రెహమానే. కానీ..100కోట్ల 'రోబో" కు..30కోట్ల 'కొమరం పులి" కి ఒకే స్థాయి సంగీతం సమకూరి ఉంటుందని భావించడం కచ్చితంగా నేరమే అవుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X