Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
రాశీ ఖన్నాకు కోలీవుడ్లో మరో ఆఫర్.. బాగానే బిజీ అవుతోంది!
రాశీ ఖన్నా ప్రస్తుతం మంచి జోరు మీదుంది. గత వారం రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ వైపు వర్కౌట్లు చేస్తూ మరో వైపు వెరైటీ ఫోటో షూట్లు చేస్తూ హల్చల్ చేస్తోంది. రాశీ ఖన్నా తన ఫోటోలతొనే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోందంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే బిజీగా అవుతోంది. ప్రస్తుతం ఆమె మరో తమిళ చిత్రంలో ఎంపికైంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సంగతమిళన్( తెలుగులో విజయ్ సేతుపతి) చిత్రంలో రాశీ ఖన్నా విజయ్ సరసన నటించింది. ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని మూట గట్టుకుంది. అది వేరే విషయమనుకోండి. తాజాగా మళ్లీ విజయ్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. విజయ్ సేతుపతి తుగ్లక్ దర్బార్ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా ఎంపికైనట్టు యూనిట్ ప్రకటించింది.
ఈ మేరకు తుగ్లక్ దర్భార్ యూనిట్ అయిన సెవెన్ స్క్రీన్ స్టూడియో స్పందిస్తూ.. విజయ్ సేతుపతి హీరోగా రాబోతోన్న తుగ్లక్ దర్బార్ చిత్రంలో రాశీ ఖన్నాను హీరోయిన్గా ఎంపికైందని ప్రకటించింది. మామూలుగా ఈ పాత్రకు ముందుగా అదితీ రావ్ హైదరీని తీసుకున్నారు, డేట్ల సమస్య తలెత్తడంతో రాశీ ఖన్నాను తీసుకున్నారు. మరోసారి విజయ్ సేతుపతి సర్తో నటించేందుకు ఎంతోఆసక్తికగా ఎదురుచూస్తున్నాను అంటూ రాశీ ఖన్నా ఆనందాన్ని వ్యక్తం చేసింది.