Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మణిరత్నం రావణ్(విలన్) చిత్రం కథ ఇదేనా?
ఐశ్వర్యా రాయ్ ప్రధానపాత్రలో అభిషేక్ బచ్చన్, విక్రమ్, పృధ్వీరాజ్ నటించిన రావణ్ (తెలుగులో విలన్) కథంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ కథ ప్రకారం విక్రమ్ ఓ క్రిమినల్ అతను వెనకాల పోలీసులు పడుతూంటారు. అతని సోదరి ప్రియమణి...ఆ పోలీసుల చేతిలో చనిపోతుంది. విక్రమ్ ని కాల్చబోతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఫృద్వీరాజ్(హిందీకి అభిషేక్ బచ్చన్). ఇక చెల్లి చనిపోయిందన్న భాధలో ఉన్న విక్రమ్..ఆ పోలీస్ ఆఫీసర్ భార్య ఐశ్వర్యా రాయ్ ని కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న అడవికి పారిపోతాడు. ఆమెని వెతుక్కుంటూ అడవులు వెంట తిరుగుతూ ఆ పోలీస్ ఆఫీసర్ ఫైనల్ గా ఐశ్వర్యను కనుగొంటాడు. అయితే అతని ఆనందం ఎంతో సేపు నిలవదు.
ఆమె..ఆ క్రిమినల్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. దాంతో అతను తన భార్యని అనుమానిస్తాడు. అక్కడ నుంచి పడే ట్విస్ట్ లతో కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. చివరకు ఐశ్వర్యారాయ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే పాయింటుతో క్లైమాక్స్ కు వస్తారు. అయితే కథ మొత్తం రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఇక రామాయణాన్ని పోలిఉండే ఈ కథే రావణ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది కరెక్టా కాదా అన్న విషయం ప్రక్కన పెడితే ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఇంతుకుముందు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ తో ఖల్ నాయక్ అనే చిత్రం వచ్చి సూపర్ హిట్టయింది.
ఇక 'రావణ్' చిత్రం జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొన్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యే ఈ చిత్రంలో విక్రమ్, అభిషేక్బచ్చన్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల్ని ఆధారంగా చేసుకొని అల్లిన కథ ఇది అంటూ మణిరత్నం చేప్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం చెన్నైలో తెలుగు వెర్షన్కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.
విక్రమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. పల్లెటూరి యాసలో ఆయన సంభాషణలుంటాయి. అలాగే అమెరికా, కెనడా, లండన్, ఫ్రాన్స్ల్లో 'రావణ్' చిత్ర ప్రచారం చేయనున్నారు. గురు తర్వాత మణిరత్నం చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మణిరత్నం ఇంతకు ముందు భారతం ఆధారంగా దళపతి చిత్రం రూపొందించి ఘన విజయం సాధించిన రీతిలోనే ఈ చిత్రం విజయం అంచనాలు వేస్తున్నారు.