twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైల్లోనే నాగార్జున...

    By Srikanya
    |

    ఆకాశమంత చిత్రంలో అందరి ప్రశంసలు పొందిన రాధామోహన్ త్వరలో నాగార్జున హీరోగా ఓ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. తమిళ,తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రానికి తమిళ టైటిల్ పయినం. తమిళంలో ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజు తన డ్యూయట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందించనున్నారు. అలాగే ఓ కొత్త జంటను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తారు. ఇప్పటివరకూ రొమాంటిక్ కామిడీలు చేస్తున్న రాధామోహన్ ఈ సారి జనర్ మార్చటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

    ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో రాధామోహన్ బిజీగా ఉన్నారు. మరి మాస్ ఇమేజ్ ఉన్న నాగార్జున-క్లాస్ ఇమేజ్ ఉన్న రాధామోహన్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతోందనే దానికి సమాధానం ఆయనే చెప్తున్నారు.

    'నాగార్జున నా సినిమాకి హీరో అని చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. నాగార్జునతో సాప్ట్ స్టోరీ చేయకూడదా? నేను మాత్రం నా స్టయిల్ లోనే ఈ సినిమా కూడా తీయబోతున్నాను. అందులో ఎలాంటి మార్పు లేదు' అని రాథామోహన్ చెప్పారు. ఈ చిత్రానికి 'పయనం' అనే టైటిల్ కూడా ఖరారైంది అన్నారు. ఇక ఈ చిత్రంలో హీరో ఓ రైలు జర్నీలో తన గత అనుభవాలు నెమరువేసుకుంటాడనీ, విభిన్న భావోద్వాగాలతో ఈ చిత్రం ఉంటుందనీ ఆయన తెలిపారు. 50 శాతం సినిమా రైలులోనే సాగుతుంది. ఇందుకోసం 25 రోజుల పాటు ఓ రైలుని అద్దెకి తీసుకోబోతున్నారు. స్క్రిప్టును బట్టి ఈ కొత్త హీరోయిన్ ను కూడా పరిచయంబోతున్నట్టు ఆయన చెప్పారు. మొత్తానికి డిసెంబర్ లో మొదలయ్యే ఈ చిత్రం కోసం నాగార్జున 25 రోజులు రైలు జర్నీ చేస్తారు.ఈ చిత్రం నవంబర్ లో ప్రారంభం అయి ఏప్రియల్ 2010 లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X