Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా పిల్లలు కరోనా నుంచి కోలుకున్నారు.. తన సేవే వారిని కాపాడిందన్న లారెన్స్
కరోనా వైరస్ విజృంభించిన సమయంలో మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చంద్రముఖి 2 సినిమాలో ఛాన్స్ వచ్చిందని, ఆ నిర్మాత ఇచ్చిన రెమ్యూనరేష్ మొత్తాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయాన్ని అందజేశాడు. ప్రస్తుతం లారెన్స్ ఆనందంలో మునిగతేలుతున్నాడు. అతని అనాథాశ్రమంలోని పిల్లలు కరోనా నుంచి కోలుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Recommended Video
మూడు కోట్ల విరాళం
ప్రభుత్వానికి అండగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు లారెన్స్. అంతేకాకుండా సినీ కార్మికులకు, వికలాంగులకు, వృద్దులకు, తాను పుట్టిన గ్రామానికి ఇలా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. మూడు కోట్లు విరాళం ఇచ్చాక కూడా తన మనసు తృప్తి చెందడం లేదని ఎంతో వేదనకు గురయ్యాడు.
ఎన్నో సేవా కార్యక్రమాలు..
మానవ సేవే మాధవ సేవ అన్నట్టు.. సేవ చేయడానికి ఇదే సమయమని లారెన్స్ పిలుపునిచ్చాడు. అందర్నీ ఆదుకోవడం తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదని, అందరూ సాయం చేయాలని కోరాడు. ఎవరైనా సాయం చేయాలనుకునేవారు తనకు విరాళాలు పంపండని కోరాడు. ఈ మేరకు ఎంతో మంది ఆకలిని తీర్చాడు.
కరోనా బారిన..
లారెన్స్ అనేక అనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లారెన్స్ అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు. ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.
నా సేవే నా పిల్లలని..
ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెబుతూ.. ‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్గారికి, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం' అని చెప్పుకొచ్చాడు.