రజనీకాంత్,జగపతిబాబు కాంబినేషన్ లో దర్శకుడు పి.వాసు రూపొందిస్తున్న 'కథానాయుకుడు' జూలై 31 న రిలీజు అవబోతోంది. చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే రిలీజై మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నయనతార, మీనా హీరోయిన్లుగా చేసే ఈ సినిమా ఇద్ధరు బాల్య మిత్రుల కథగా కొనసాగుతుంది . మళయాల చిత్రం 'కథా పెరియంబోల్' ఆధారంగా తయారైన ఈ సినిమాలో రజనీకాంత్ తన నిజజీవతి పాత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ గా చేస్తున్నారు. 'చంధ్రముఖి' వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంతటా హైప్ ఉంది.