Don't Miss!
- News Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అవినీతి ఉద్యమం కోసం రజనీ ఉచితంగా...
అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే బృందం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దీక్ష చేయడానికి ఎంఎంఆర్డి గ్రౌండ్ కు రూ. 8లక్షల అద్దె కట్టే స్తోమత లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుంది అన్నా బృందం. అయితే అన్నా అవినీతి పోరాటానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. చెన్నయ్ లో దీక్ష చేస్తే నగరం నడి ఒడ్డున గల తన రాఘవేంద్ర కళ్యాణ మంటపాన్ని మూడు రోజుల పాటు ఉచితం ఇచ్చేందుకు అంగీకరించారు.
భారత అవినీతి వ్యతిరేక కమిటీ మెంబర్ ఎంఎస్. చంద్రమోహన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ....తమ అభ్యర్థనకు రజనీకాంత్ సానుకూలంగా స్పందించారని, కళ్యాణ మంటపాన్ని దీక్ష కోసం ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు.
ఇప్పటికే అనేక మందికి అండగా నిలుస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్...తాజాగా అవినీతి కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి తన వంతు సాయం చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.