Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సినిమాల విషయంలో రజినీకాంత్ కీలక నిర్ణయం: మార్చి 15 నుంచే వేట మొదలు
విలక్షణ నటన, విభిన్నమైన స్టైల్స్తో దాదాపు నలభై ఏళ్లుగా ఇండియన్ సినిమాపై తన మార్క్ చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోన్న ఆయన.. మార్కెట్ను కూడా గణనీయంగా పెంచుకున్నారు. అదే సమయంలో తన ఖ్యాతిని ఖండాతరాలు దాటించేశారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆయన జీవితంలో ఊహించని సంఘటనలు జరిగడంతో సినిమాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తలైవా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు రజినీకాంత్. ఈ సినిమా షూటింగ్ కోసమే కొద్ది రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఓ షెడ్యూల్ జరుగుతోన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సను తీసుకుని కోలుకున్నారు. 48 గంటల అనంతరం డిశ్చార్చ్ అయిన ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, 'అన్నత్తే' సినిమా షూటింగ్ కోసం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుంటున్నారని ఓ న్యూస్ వైరల్ అయింది.
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో రజినీకాంత్ తన సినిమా 'అన్నత్తే' విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం ఆయన మార్చి 15 నుంచి డేట్స్ కేటాయించారట. ఇందుకోసం మరోసారి హైదరాబాద్ వచ్చి సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నారు.