Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సినిమాల విషయంలో రజినీకాంత్ కీలక నిర్ణయం: మార్చి 15 నుంచే వేట మొదలు
విలక్షణ నటన, విభిన్నమైన స్టైల్స్తో దాదాపు నలభై ఏళ్లుగా ఇండియన్ సినిమాపై తన మార్క్ చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోన్న ఆయన.. మార్కెట్ను కూడా గణనీయంగా పెంచుకున్నారు. అదే సమయంలో తన ఖ్యాతిని ఖండాతరాలు దాటించేశారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆయన జీవితంలో ఊహించని సంఘటనలు జరిగడంతో సినిమాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తలైవా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు రజినీకాంత్. ఈ సినిమా షూటింగ్ కోసమే కొద్ది రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఓ షెడ్యూల్ జరుగుతోన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సను తీసుకుని కోలుకున్నారు. 48 గంటల అనంతరం డిశ్చార్చ్ అయిన ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, 'అన్నత్తే' సినిమా షూటింగ్ కోసం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుంటున్నారని ఓ న్యూస్ వైరల్ అయింది.
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో రజినీకాంత్ తన సినిమా 'అన్నత్తే' విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం ఆయన మార్చి 15 నుంచి డేట్స్ కేటాయించారట. ఇందుకోసం మరోసారి హైదరాబాద్ వచ్చి సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నారు.