Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రజినీకాంత్ సినిమాకు మరో ఎదురుదెబ్బ: అప్పుడు అనారోగ్యం.. ఇప్పుడు ఇలా
ఏజ్ బార్ అవుతున్నా.. కుర్రాళ్లతో పోటీగా వేగంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ప్రస్తుతం 'అన్నత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ సిరుత్తి శివ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల క్రితం హైదరాబాద్లో 'అన్నత్తే' మూవీ షూటింగ్ను పున: ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడిపోయినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజు రోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బడా ప్రాజెక్టులతో పాటు చాలా సినిమాల షూటింగులు ఆగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోన్న రజినీకాంత్ నటిస్తోన్న 'అన్నత్తే' చిత్రీకరణను కూడా ఆపేశారని తెలిసింది. అంతేకాదు, ఇప్పటికే యూనిట్ సభ్యులు చెన్నైకు కూడా బయలుదేరానని ప్రచారం జరుగుతోంది. రజినీ కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్లబోతున్నారని అంటున్నారు.
'అన్నత్తే' మూవీ షూటింగ్ కోసం గతంలోనూ ఓ సారి రజినీకాంత్ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ గత వారమే ఇక్కడకు వచ్చారు. ఇప్పుడేమో ఇలా షూటింగ్ ఆగిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది.