Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రజనీకాంత్కు సమన్లు.. కాల్పుల ఘటన వివాదంలో సూపర్స్టార్ రియాక్షన్ ఏమిటంటే
తమిళనాడులో తూతుకుడిలోని స్టెరిలైట్ ప్లాంట్ వద్ద 2018లో నిరసన చేపట్టిన ఆందోళనకారులపై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఆ వివాదం సూపర్స్టార్ రజినీకాంత్ను ఇరుకునపెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఈ కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన రజనీకాంత్ మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలిచారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
దాంతో ఆ వివాదంపై ఏర్పాటు చేసిన అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిటీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే రెండుసార్లు కూడా కమిషన్ ముందు రజినీ హాజరుకాలేదు. కానీ లిఖితపూర్వకమైన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా కమిటీ సభ్యులు రజనీకాంత్కు 15 ప్రశ్నలతో కూడిన లేఖను పంపించగా వాటికి సమాధానాలు తెలిపినట్టు సమాచారం.
ఇటీవల రజనీకాంత్ సమర్పించిన సమాధానాలను త్వరలోనే తమిళనాడు ప్రభుత్వానికి అరుణా జగదీశన్ కమిటీ సభ్యులు అందజేసే అవకాశం ఉంది. అయితే రజనీ సమాధానాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూందో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న అన్నాతే షూటింగులో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొందిన అన్నాతే టీమ్ తెలంగాణలో నైట్ కర్ప్యూ సమయంలో కూడా షూటింగు చేస్తుండటం విశేషం. అంతా సవ్యంగా సాగితే.. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.