ఎంత బతిమాలినా రిస్క్ చేయలేనని చేతులెత్తేసిన రజినీకాంత్.. ఇక వచ్చే ఏడాదే..
సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాదిలో ఎప్పుడు లేనంత బిజీగా కనిపించాడు. గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొని సినిమాలను చాలా తొందరగా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం దర్శక నిర్మాతలు ఎంత బతిమాలుతున్నా కూడా రిస్క్ చేయలేనని చెప్పేస్తున్నారట. కరోనా వైరస్ వలన రిస్క్ చేయలేనని తలైవా ఒక బలమైన నిర్ణయానికి వచ్చారట.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు..ముఖ్యంగా తమిళనాడు అత్యదిక కరోనా కేసులు ఉన్న రెండవ రాష్ట్రంగా కొనసాగుతోంది. దీంతో కొందరు షూటింగ్స్ చేయడానికి ఏ మాత్రం రిస్క్ చేయడం లేదు. ఏడు పదుల వయసు దగ్గర పడుతుండడంతో రజినీకాంత్ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

ఈ సమయంలో కరోనా దరి దాపుల్లోకి కూడా వెళ్లకూడదని ఒక బలమైమ నిర్ణయం తీసుకున్నారు. అందుకే శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ లో ఇప్పట్లో పాల్గొనలనని డైరెక్ట్ గా చెప్పేశారు. ఏదైనా ఇక వచ్చే ఏడాదే అంటూ నిర్మాతలకు ఆన్సార్ ఇచ్చారట. దీంతో దర్శకుడు, రజినీకాంత్ లేకుండానే ఇతర నటీనటులతో షూటింగ్ స్టార్ట్ చేశాడు. రజినీకాంత్ వచ్చే వరకు వీలైనంత షూటింగ్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











