Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోహన్ బాబు ఇంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష్యం
కెరీర్ ప్రారంభం నుంచీ మోహన్ బాబు, రజనీకాంత్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్య ఇద్దరి మధ్యా విభేధాలు పొడచూపాయంటూ వార్తలు వచ్చాయి. కానీ నిన్న (ఆదివారం) రజనీకాంత్ తన పుట్టిన రోజు సందర్భంగా మిత్రుడు మోహన్ బాబు ఇంటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ ఆదివారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచ్చేసిన ఆయన బంజారాహిల్స్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు. తన ప్రియమిత్రుడు, నటుడు మోహన్బాబు ఇంటికి ఉదయాన్నే వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అనంతరం మాదాపూర్లోని మోహన్బాబు కార్యాలయానికి వెళ్లి అక్కడ కొద్దిసేపు గడిపారు. మధ్యాహ్నం తిరిగి మోహన్బాబు ఇంటికి వచ్చి భోజనం చేశారు. సాయంత్రం 5.20గంటలకు చెన్నై తిరిగి వెళ్లినట్లు సమాచారం.
పుట్టినరోజున రజనీ చెన్నైలో లేరనే వార్త వారిని నిరాశకు గురిచేసింది. కాగా, రజనీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ఉదయాన్నే రజనీకాంత్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రజనీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒడిస్సీ అనే సంస్థ రజనీ పంచతంత్ర పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఆవిష్కరించగా, నటి రాధిక దాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రజనీ పెద్దకుమార్తె ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.
ఆయన అభిమానులు మాత్రం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తమిళనాడు వ్యాప్తంగా రజనీ జన్మదినాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడికి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు పోయేస్ గార్డెన్లోని రజనీ నివాసం వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. దీంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులకు రజనీకాంత్ లేరన్న సమాచారం నిరాశ కలిగించింది. అయితే రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ వచ్చిన అభిమానులందరికీ స్వీట్లు పంచి పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.