Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనాకు ఎదురెళ్లి మరీ పూర్తి చేసిన రజినీకాంత్: లేటు వయసులోనూ స్పీడుగానే
ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. పేరుకు బడా స్టారే అయినా ప్రతి ఏడాది ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారాయన. అలా వేగంగా చిత్రాలను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కానీ, ఆయన తాజా చిత్రం 'అన్నాత్తే'కు మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు రజినీ. గత ఏడాదే ప్రకటించిన ఈ సినిమాకు వరుసగా ఆటంకాలు ఎదురవుతూ వస్తున్నాయి. దీంతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంతో తాజాగా రజినీకాంత్ ఈ చిత్రాన్ని పూర్తి చేసేశారు.
కోలీవుడ్లో మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సిరుత్తై శివ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న చిత్రమే 'అన్నత్తే'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోనే జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రజినీకాంత్ నిన్నటితో తన భాగాన్ని పూర్తి చేసుకున్నారట. దీంతో ఆయన ఈ సినిమా నుంచి రిలీవ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు, నయనతార కూడా ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో పాల్గొని, తాను చేయాల్సిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసుకుంది. సో.. మిగిలిన కొన్ని సీన్స్ మినహా సినిమా పూర్తైంది.
కరోనా ప్రభావం భారీగా ఉన్నప్పటికీ.. 'అన్నత్తే' కోసం రజినీకాంత్ డేట్స్ కేటాయించారు. ఇందులో భాగంగానే దాదాపు నెల రోజులుగా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఎట్టకేలకు తన పార్ట్ను పూర్తి చేసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.