Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు: వాళ్లతో సమావేశం వల్లే ఇలా!
పేరుకు సౌతిండియన్ స్టారే అయినా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ హీరో రజినీకాంత్. విభిన్నమైన శైలితో పాటు విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన.. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న సూపర్ స్టార్... సమాజంలో జరిగే అంశాలపైనా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు రజినీకాంత్. సహచర హీరో కమల్ హాసన్ ఇప్పటికే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయగా, సూపర్ స్టార్ కూడా ఆయన బాటలోనే నడవబోతున్నారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం నవంబర్ 30న రజినీకాంత్ తన అభిమాన సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడమే. చెన్నైలోని ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో రాజకీయ అడుగుల గురించి మంతనాలు జరపనున్నారని తెలిసింది. దీంతో ఏ క్షణమైనా కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం రజినీకాంత్... మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న ఆయన.. ఈ మూవీతోనైనా భారీ హిట్ను అందుకోవాలని భావిస్తున్నారు. అందుకోసమే ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక, ఇటీవలే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా సినిమా షూటింగ్లకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఖాళీ సమయాన్ని రాజకీయ భవిష్యత్ కోసం కేటాయించారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.