Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి తాత కాబోతున్న రజనీకాంత్.. ఇంటి సభ్యుల్లో ఆనందోత్సవాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటిలో ఆనందం వెల్లువిరిసింది. ఇప్పటికే రజనీకాంత్ తాత అయిన సంగతి తెలిసిందే. తన కుమార్తె ఐశ్వర్య ధనుష్, ధనుష్ దంపతులకు లింగా, యాత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా తన కుమార్తె సౌందర్య మరోసారి తల్లి కాబోతున్న ఉండటంతో ఇంటి సభ్యుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి.
సౌందర్య రజనీకాంత్ ఇటీవల వ్యాపారవేత్త విశాఖన్తో రెండో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. గతంలో సౌందర్య రజనీకాంత్కు మొదటి వివాహం ద్వారా వేద్ అనే కుమారుడు ఉన్నారు. తాజాగా విశాఖన్తో పెళ్లి తర్వాత మరోసారి గర్భం దాల్చింది.
ఇదిలా ఉండగా, రజనీకాంత్ ఇటీవలే అమెరికా పర్యటనను ముగించుకొని చెన్నైకి తిరిగి వచ్చారు. తన హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. చెన్నైకి వచ్చి రాగానే తన కూతురు తల్లి కాబోతున్నదనే వార్త రజినీకాంత్కు సంతోషాన్ని కలిగించింది.
ఫ్లాప్ హీరోయిన్కు బండ్ల గణేష్ బంపర్ ఆఫర్.. ఓంకార్ ముందే లక్ష రూపాయలకు బదులుగా కోటి అంటూ..
ఇక రజనీకాంత్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో అన్నాతే షూటింగ్ను ముగించుకొన్నారు. ఆ తర్వాత తన ఆరోగ్యం పరీక్షల కోసం అమెరికా వెళ్లి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. మళ్లీ షూటింగులో పాల్గొనేందుకు రజనీ దర్శక నిర్మాతలకు డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తున్నది.
స్కీన్ షోతో హంసా నందినీ హల్చల్: తడిచిన అందాలతో కాక రేపుతోన్న టాలీవుడ్ బ్యూటీ
ఇదిలా ఉండగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాతే చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు డి ఇమాన్ సంగీతం, వెట్రీ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సన్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్నది. ఈ చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్ తదితరుల నటిస్తున్నారు.