రంగం దర్శకుడితో రజనీకాంత్?
రంగం చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ త్వరలో రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ విషయమై కే వి ఆనంద్ ని అడుగగా అయన మౌనం పాటించారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానుందనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. కేవీ ఆనంద్ ప్రస్తుతం సూర్య మరియు కాజల్ ప్రధాన పాత్రలలో “మాట్రన్" అనే చిత్రం చేస్తున్నారు.
రజనీకాంత్ తమిళంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మొత్తం 80 కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె నటిస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రోబో తర్వాత రజనీ 'రాణా' చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి గురి కావడం సినిమా అటకెక్కింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రజనీ మళ్లీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











