రిజెక్ట్: నన్ను కొడితే ఫ్యాన్స్ తట్టుకోలేరన్న రజనీకాంత్
హైదరాబాద్: మళయాలంలో సూపర్ హిట్టయిన దృశ్యం చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులో, హిందీలో రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగులో వెంకీ చేయగా, హిందీలో అజయ్ దేవగన్ చేసారు. తాజాగా తమిళంలో కమల్ హాసన్ హీరోగా ఈచిత్రాన్ని ‘పాపనాశనం' పేరుతో రీమేక్ చేసారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్తో చేయాలనుకున్నారట. అయితే సినిమాలో పోలీసులు హీరోను తీవ్రంగా కొట్టే సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కూడా తీవ్రంగా హింసిస్తారు. ఈ రెండు అంశాల కారణంగానే రజనీకాంత్ ఈ చిత్రాన్ని తిరస్కరించారట. తనను బాగా కొట్టడం చూసి అభిమానులు తట్టుకోలేరని, అందువల్ల ఫలితాలు సరిగా రాక పోవచ్చని రజనీకాంత్ చెప్పారట. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా వెల్లడించారు.
కాగా... తమిళంలో కమల్ హాసన్, గౌతమి నటించిన ‘పాపనాశనం' చిత్రం ఇటీవల విడుదలై మంచి ఓపెన్సింగ్ సాధించింది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.


Click it and Unblock the Notifications











