Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'రోబో 2.0' ఆ విషయంలో మాత్రం 'బాహుబలి ' రికార్డ్ ని బ్రద్దలు కొట్టింది
తమిళం, హిందీ భాషల్లో 3డీ ఫార్మెట్లో తెరకెక్కుతున్న రోబో 2 చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్యూరెన్స్ చేసినట్లు తాజా సమాచారం.
చెన్నై: సౌతిండియా సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో '2.0' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ చిత్రం రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంకి సంభందించిన ఓ ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ 2.ఓ చిత్రం తమిళం, హిందీ భాషల్లో 3డీ ఫార్మెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్యూరెన్స్ చేసినట్లు తాజా సమాచారం. చిత్ర షూటింగ్లో జరిగే అసంభవాలు, విపత్తులు,సెట్ ప్రాపర్టీ నష్టం ,ప్రాణ హాని లాంటి సంఘటలకు పరిహారం పొందడానికి ఈ ఇన్యూరెన్స్ సాయపడుతుంది.
ఇటీవల కొన్ని సినిమా షూటింగ్లలో ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుండడంతో 2.ఓ చిత్ర నిర్మాతలు ఇన్యూరెన్స్ చేసినట్లు తెలిసింది. ఈ ఇన్సూరెన్స్ ట్రెండ్ ..ఐశ్వర్యారాయ్ ...తాళ్ సినిమాతో మొదలైంది. అలాగే సల్మాన్ ఖాన్ కిక్ చిత్రానికి 300 కోట్లకు , రాజమౌళి..బాహుబలి చిత్రానికి 200 కోట్లకు ఇన్సూరెన్స్ చేయింటినట్లు సమాచారం.
ఇప్పుడు ఆ రికార్డ్ లన్నిటినీ రోబో 2 బ్రద్దలు కొట్టేసింది. అయితే సినిమా ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ డబ్బు రాదు. కేవలం విపత్తులు, ప్రాణ నష్టం, సెట్ ప్రాపర్టీ నాశనం వంటి వాటికే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
రోబో 2 చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదలకు సన్నాహాలు జరుగుతునట్లు సినీ వర్గాల సమాచారం. పలువురు హాలీవుడ్ కళాకారులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్లో రజనీకాంత్ పాల్గొంటున్నారు. ఏఆర్.రెహ్మాన్ గీత బాణీలు కడుతున్న 2.ఓ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి దర్శకుడు శంకర్ బృందం తీవ్రంగా కృషి చేస్తోంది.
ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్తున్నారు.