Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రజనీ ఫ్యాన్స్పై పిడుగులాంటి వార్త.. రోబో2.0 విషయంలో అసంతృప్తి
సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానులపై పిడుగులాంటి వార్త పడింది. ఇప్పటికే ఆలస్యమైన రోబో2కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారవుతున్నది. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కారణంగా ఈ చిత్ర విడుదల జాప్యం జరుగడం మరింత కుంగదీస్తున్నది. ఈ చిత్రానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటిగ్రేషన్ (సీజీఐ) పనులపై చిత్ర యూనిట్, దర్శకుడు శంకర్ పెదవి విరిచాడట. దాంతో ఈ చిత్రానికి మరిన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. త్వరలోనే మార్పులకు సంబంధించిన సీజీ పనులు మొదలుపెట్టనున్నట్టు సమాచారం.
రోబో2 చిత్రాన్ని వాస్తవానికి 2018 మేలో రిలీజ్ చేయాలనుకొన్నారు. దానిని ఆగస్టుకు వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా మళ్లీ 2019కి వాయిదా వేశారు. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.