Don't Miss!
- News TTD: తిరుమల భక్తులకు శుభవార్త: లక్కీడిప్ డేట్స్ ఇవే; దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి!!
- Sports KKR vs RR: అందుకే తుది జట్టులో మార్పులు చేశాం: సంజూ శాంసన్
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
స్టూడెంట్స్కి కాలింది.. రజనీకాంత్ సినిమా సెట్స్పై రాళ్ల దాడి!
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్, రజనీకాంత్ తొలి కాంబినేషన్ లో తెరక్కుతున్న చిత్రం దర్భార్. ముంబైలో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ప్రారంభించిన రోజే దర్బార్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. రజనీకాంత్ పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. దర్భార్ చిత్ర యూనిట్ కు అడుగడుగునా చిక్కులు తప్పడం లేదు. తాజాగా దర్భార్ చిత్ర సెట్స్ పై విద్యార్థులు రాళ్ల దాడితో విరుచుకుపడ్డారు.
ఫోటోలు లీక్
దర్శకుడు మురుగదాస్ తాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న తొలి చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. షూటింగ్ లొకేషన్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫోటోలు మాత్రం లీకైపోతున్నాయి. ఇటీవల రజనీకాంత్ లుక్ కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా నటిస్తున్న నయనతార ఫోటోలని కూడా లీక్ చేసేశారు. దీనితో మురుగదాస్ సెట్స్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
కాలేజీలో షూటింగ్
ప్రస్తుతం దర్భార్ చిత్ర షూటింగ్ ముంబైలోని ఓ కళాశాలలో జరుగుతోంది. కాలేజీ విద్యార్థులు రజనీని చూసేందుకు, షూటింగ్ ని ఆస్వాదించేందుకు సెట్స్ వద్దకు ఎగబడుతున్నారు. మొబైల్స్ లో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నారు. దీనితో చిత్రయూనిట్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించి వారిని సెట్స్ నుంచి దూరంగా పంపించివేశారట. దర్భార్ చిత్ర యూనిట్ వైఖరికి విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సెట్స్ పై రాళ్లదాడితో విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది.
భలే హిట్టు కొట్టావు రాఘవ... లారెన్స్, హీరోయిన్కు రజనీ అభినందన.. బాక్సాఫీస్ను వణికిస్తున్న కాంచన3!
లొకేషన్ మార్చాలని
ఇలా విద్యార్థుల నుంచి నిత్యం సమస్యలు ఎదురవుతుండడంతో మురుగదాస్ స్వయంగా కాలేజీ యాజమాన్యంతో చర్చలు జరిపారట. షూటింగ్ వైపు విద్యార్థులని రానీయవద్దని, అలా కుదరకపోతే మరో ప్రత్యామ్నాయం చూసుకుంటాం అని మురుగదాస్ కాలేజీ యాజమాన్యంతో చెప్పినట్లు తెలుస్తోంది. రజని, నయనతార ఇప్పటికే చంద్రముఖి, కథానాయకుడు లాంటి చిత్రాల్లో జంటగా నటించారు.
రాజకీయ నేపథ్యంలో
మురుగదాస్ చివరగా తెరకెక్కించిన చిత్రం సర్కార్. విజయ్ నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. వివాదాలతోనే ఈ చిత్రం ఘనవిజయంగా నిలిచింది. సర్కార్ చిత్రాన్ని మురుగదాస్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించారు. దర్భార్ చిత్రాన్ని ఎలాంటి కథతో తెరకెక్కిస్తున్నారనే ఉత్కంఠ రజని ఫాన్స్ లో నెలకొని ఉంది.